న్యూఢిల్లీ: ఆసియా యూత్, జూనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్ టోర్నీలో భారత బాక్సర్లు విశ్వనాథ్ సురేశ్ (48 కిలోలు), ఆనంద్ యాదవ్ (54 కి) పసిడి పోరుకు దూసుకెళ్లారు. యూత్ విభాగంలో విశ్వనాథ్ 4-1తో మిరాలీజోన్ మావ్లోనవ్ (ఉజ్బెకిస్థాన్)పై నెగ్గి ఫైనల్కు చేరగా.. ఆనంద్ 3-2తో అబ్దువలీ బురిబోవ్ (ఉజ్బెకిస్థాన్)ను చిత్తు చేశాడు. మిగతా బౌట్లలో వంశజ్ (63.5కి), దీపక్ (75కి), అమన్సింగ్ బిష్త్ (+92కి) విజయం సాధించారు. జూనియర్ విభాగం సెమీస్లో యశ్వర్ధన్ సింగ్ (60 కి), రిషబ్సింగ్(80 కి) నెగ్గి స్వర్ణ పోరుకు ఎంపికవగా.. జయంత్ దాగర్ (54 కి), చేతన్ (57కి), జాక్సన్సింగ్ లైశ్రమ్ (70 కి), దేవ్ప్రతాప్ సింగ్ (75కి), గౌరవ్ మాస్కే (+80 ని) సెమీస్లో పరాజయంతో కాంస్యంతో సరిపెట్టుకున్నారు.