దుబాయ్: ప్రపంచకప్లో మెరుగైన ప్రదర్శనతో దిగ్గజ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ఒక స్థానం మెరుగుపరచుకుని మూడో స్థానానికి చేరుకున్నాడు. కాగా శుభ్మన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రపంచకప్లో అత్యధికంగా 765 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన కోహ్లీ.. గిల్కంటే 35 రేటింగ్ పాయింట్లు తక్కువగా 791 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. గిల్ 826 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, 824 పాయింట్లతో బాబర్ ఆజమ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 769 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డికాక్ రెండు స్థానాలు దిగజారి 5వ ర్యాంక్కు, డారిల్ మిచెల్ అయిదు స్థానాలు మెరుగై 6వ స్థానానికి చేరుకున్నారు. బౌలర్లలో కేశవ్ మహరాజ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్కు చెందిన మహ్మద్ సిరాజ్ మూడు, జస్ప్రీత్ బుమ్రా నాలుగు, కుల్దీప్ యాదవ్ ఆరవ ర్యాంక్లలో నిలిచారు.