మెల్బోర్న్: టీ20 వరల్డ్కప్లో అద్భుత ప్రదర్శన ఇస్తున్న విరాట్ కోహ్లీ.. అక్టోబర్ నెలలో ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ద మంత్ కోసం జింబాబ్వే క్రికెటర్ సికందర్ రాజా, సౌతాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్ కూడా పోటీపడ్డారు. కానీ టైటిల్ను ఇండియన్ బ్యాటర్ కోహ్లీ ఎగురేసుకుపోయాడు.
అక్టోబర్ నెలలో కేవలం నాలుగు ఇన్నింగ్స్లో మాత్రమే కోహ్లీ బ్యాటింగ్ చేశాడు. కానీ దాంట్లో మూడు మ్యాచుల్లో అద్భుతమైన గేమ్ ఆడాడు. పాకిస్థాన్పై 82 నాటౌట్ ఇన్నింగ్స్ అసాధారణమైందని ఐసీసీ తెలిపింది. ఆ మ్యాచ్లో దాదాపు ఓటమి అంచులో ఉన్న ఇండియాను కోహ్లీ తన అద్భుత ఇన్నింగ్స్తో గట్టెక్కించాడు. టీ20ల్లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్ అని కూడా కోహ్లీ తెలిపాడు.
ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ కోసం జరిగిన ఓటింగ్లో తనను చేర్చడం గౌరవంగా భావిస్తున్నట్లు కోహ్లీ తెలిపాడు. ఈ నెలలో అమోఘ ప్రదర్శన ఇచ్చిన ఇతర ఆటగాళ్లను కూడా కోహ్లీ మెచ్చుకున్నాడు. ఇటీవల గౌహతిలో జరిగిన మ్యాచ్లో కేవలం 28 బంతుల్లో సౌతాఫ్రికాపై 49 రన్స్ చేశాడు. ఇక వరల్డ్కప్లో నెదర్లాండ్స్పై 44 బంతుల్లో 62 రన్స్ చేశాడు.
వరల్డ్కప్లో ఇండియాను సెమీస్కు చేర్చడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. గురువారం అడిలైడ్లో జరిగే సెమీస్లో ఇంగ్లండ్తో ఇండియా తలపడనున్నది.
A batting stalwart wins the ICC Men's Player of the Month award for October after some sensational performances 🌟
Find out who he is 👇
— ICC (@ICC) November 7, 2022