Virat Kohil: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి సెంచరీ ముందు నిష్క్రమించి వన్డేలలో అరుదైన ఘనతను మిస్ చేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్లో భీకరమైన ఫామ్లో ఉన్న రన్ మిషీన్.. శ్రీలంకతో మ్యాచ్లో శతకానికి 12 పరుగుల దూరంలో నిష్క్రమించడంతో సచిన్ టెండూల్కర్ రికార్డును.. అతడి ముందే సమం చేసే గొప్ప ఛాన్స్ను కోల్పోయాడు. కోహ్లీ అర్థ సెంచరీ పూర్తి చేసి 80లలోకి వచ్చిన తర్వాత అతడు కచ్చితంగా వంద కొడతాడని అంతా భావించినా ఈ వెటరన్ బ్యాటర్ మాత్రం మరోసారి విఫలమయ్యాడు.
కోహ్లీకి గత ఏడు మ్యాచ్లలో సెంచరీ మిస్ అవడం ఇది మూడోసారి. వరల్డ్ కప్లో భాగంగా చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 85 పరుగులు చేసిన కోహ్లీ.. న్యూజిలాండ్తో మ్యాచ్లో 95 పరుగుల వద్ద నిష్క్రమించాడు. తాజాగా శ్రీలంకతో కూడా 88 పరుగులు చేసి శతకం చేజార్చుకున్నాడు. ఈ ప్రపంచకప్లోనే మూడుసార్లు శతకాలు చేజార్చుకోవడం గమనార్హం.
2020 నుంచి 2022 దాకా అత్యంత పేలవ ఫామ్తో కెప్టెన్సీతో పాటు ఓ దశలో జట్టులో చోటు కూడా కోల్పోతాడా..? అన్నంత వైఫల్యాలతో సాగిన విరాట్ కెరీర్.. గతేడాది ఆసియా కప్తో తిరిగి గాడిలో పడింది. దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియా కప్లో అఫ్గానిస్తాన్తో సెంచరీతో పాటు పాకిస్తాన్పై హాఫ్ సెంచరీతో మునపటి ఫామ్ అందుకున్న కోహ్లీ.. టీ20 ప్రపంచకప్తో పాటు బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో రాణించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో తోపు రికార్డులు సొంతం చేసుకున్న కోహ్లీ.. వన్డేలలో గత 15 మ్యాచ్లలో అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. గత 15 ఇన్నింగ్స్లలో కోహ్లీ చేసిన స్కోర్లు .. 82, 77, 67, 72, 66, 26, 34, 1, 85, 22, 55, 16, 103, 95, 0, 88గా ఉన్నాయి.