న్యూఢిల్లీ: రెజ్లర్ వినేశ్ పోగట్ను చిత్రహింస పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒలింపిక్స్లో మెడల్ రాకపోవడంతో ఆమెను టార్చర్ చేశారని తోటి రెజ్లర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ఒలింపిక్ సంఘానికి లేఖ రాశారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉషకు రాసిన లేఖలో పేర్కొన్నారు. యువ మహిళా రెజ్లర్లపైన కూడా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వేధింపులకు పాల్పడుతున్నట్లు అనేక మంది ఫిర్యాదు చేసినట్లు ఆ లేఖలో తెలిపారు.
పీటీ ఉషకు రాసిన లేఖలో టోక్యో ఒలింపిక్స్ మెడల్స్ గ్రహీతలు రవి దహియా, బజ్రంగ్ పూనియాలు ఉన్నారు. రియో గేమ్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచిన సాక్షీ మాలిక్, వరల్డ్ చాంపియన్షిప్ రెజ్లర్ దీపక్ పునియా కూడా ఉన్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేయాలని, ఆ శాఖ అధ్యక్షుడిని తొలగించాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. రెజ్లింగ్ సమాఖ్యకు చెందిన కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
@PMOIndia @AmitShah @ianuragthakur @PTUshaOfficial pic.twitter.com/PwhJjlawPg
— Vinesh Phogat (@Phogat_Vinesh) January 20, 2023