న్యూఢిల్లీ : ఆసియా క్రీడల కోసం జరుగుతున్న సెలక్షన్ ట్రయల్స్ బౌట్లో రెజ్లర్ వినేశ్ పోగట్(Vinesh Phogat) విక్టరీ కొట్టింది. ఇవాళ జరిగిన ఓపెనింగ్ బౌట్లో ఆమె 7-1 స్కోరు తేడాతో రెజ్లర్ జ్యోతిపై విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభంలో జాగ్రత్తగా ఉన్న వినేశ్ ఆ తర్వాత బౌట్ సాగుతున్న కొద్దీ మెరుగైన గేమ్ను ప్రదర్శించింది. తొలుత పుష్ పాయింట్, ఆ తర్వాత డబుల్ లెగ్ అటాక్కు దిగింది. ప్రత్యర్థికి ఎటువంటి పాయింట్లు ఇవ్వకుండా జాగ్రత్తపడింది.
ఇక సెకండ్ పీరియల్లో వినేశ్ పోగట్ పూర్తిగా డామినేట్ చేసింది. రైట్ లెగ్ అటాక్ను వాడుకుని 3-0తో ఆధిపత్యం చాటింది. రెజ్లర్ జ్యోతి కూడా లెగ్ అటాక్కు దిగినా.. ఆ ఫైట్లో వినేశ్ విజేతగా నిలిచింది. కౌంటర్ అటాక్లో వరుసగా రెండు క్విక్ మూవ్స్తో 7-0 స్కోరు సాధించింది వినేశ్. జ్యోతి ఒక పుష్ ఔట్ పాయింట్ గెలుచుకున్నది.
వినేశ్ తన తర్వాత బౌట్లో నిషూతో ఆడనున్నది. రెజ్లర్ వినేశ్కు తొలుత రెజ్లింగ్ సమాఖ్య సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆమె సుప్రీంను ఆశ్రయించింది. అయితే 53 కేజీల కేటగిరీలో వినేశ్ ఆడేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.