న్యూఢిల్లీ: భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన అర్ధాంగి, బాలీవుడ్ కథానాయకి అనుష్క శర్మ బృందావన్ ఆశ్రమంలో సందడి చేశారు. రెండు రోజుల బృందావన్ పర్యటనలో భాగంగా గురువారం విరుష్క దంపతులు తమ కూతురు వామికతో కలిసి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ ప్రేమానంద్ మహరాజ్ స్వామీజీ చెప్పిన ప్రవచనాలను ఆలకించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వీడియోలో అనుష్క, విరాట్ దంపతులిద్దరూ స్వామీజీ ముందు చేతులు జోడించి కూర్చుకున్నారు. వామికను అనుష్క తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఉంది. ఆ సమయంలో ఓ స్వామీజీ వచ్చి అనుష్కకు సంప్రదాయబద్ధంగా వస్త్రాన్ని కప్పి వెళ్లాడు. మరో స్వామీజీ విరాట్ కోహ్లీ మెడలో, అనుష్క ఒడిలో ఆడుతున్న వామిక మెడలో మాలలు వేశాడు. కింది వీడియోలో ఆ దృశ్యాలను మీరు కూడా చూడవచ్చు.
అనుష్క, విరాట్ దంపతులు బృందావన్ పర్యటనకు ముందు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం దుబాయ్ వెళ్లారు. డిసెంబర్ 31 రాత్రి అక్కడ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. కాగా, అనుష్క శర్మ 2017 డిసెంబర్ 11న విరాట్ కోహ్లీని వివాహం చేసుకుంది. వారికి 2021 జనవరిలో వామిక జన్మించింది. ఇప్పటికీ విరాట్ క్రికెట్లో, అనుష్క సినిమాల్లో తమ జోరు కొనసాగిస్తూనే ఉన్నారు.
वृंदावन में स्वामी प्रेमानन्द गोविन्द शरणजी महाराज से आशीर्वाद लेने पहुँचे @imVkohli @AnushkaSharma अपनी बिटिया के साथ. #ViratKohli𓃵 #AnushkaSharma pic.twitter.com/JqIA3vfykt
— Brajesh Rajput (@brajeshabpnews) January 6, 2023