కారకాస్: వెనిజువెలా శిథిలాల దిబ్బగా మారింది. బుధవారం సాయంత్రం సంభవించిన జంట భూకంపాల(Venezuela Earthquakes) వల్ల ఆ దేశంలో మృతిచెందిన వారి సంఖ్య 235కు చేరుకున్నది. ఇక గాయపడ్డవారి సంఖ్య 4300 దాటింది. కారకాస్కు సమీపంలో ఉన్న కోస్టల్ నగరం లా గైరాలో ఇంకా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. అనేక బిల్డింగ్లు నేలమట్టం కావడం వల్ల వేల సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు. కొన్ని బిల్డింగ్లకు భద్రత కరువైంది. రెండు రోజులుగా జనం రోడ్డుపైనే నిద్ర పోయారు. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేజ్ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. వెనిజువెలాకు సహాయం అందించేందుకు అనేక దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. రెస్క్యూ ఆపరేషన్స్ కోసం అమెరికా నౌకలను, విమానాలను పంపిస్తున్నది. లా గైరా సిటీలో సుమారు 250 బిల్డింగ్లు నేలమట్టం అయినట్లు జార్జ్ రోడ్రిగ్రేజ్ తెలిపారు. ఓ పది అంతస్తుల హోటల్ పూర్తిగా ధ్వంసమైన విషయం తెలిసిందే.
A security camera in #Venezuela captured the exact moment an #earthquake caused cracks to begin forming in a building, as dozens of people desperately tried to escape to safety. These are the kinds of images that shook the world. 🇻🇪🙏#Earthquake #Disaster#Venezuela pic.twitter.com/pdO4viy6zR
— Ronny (@FreePalesten) June 26, 2026