హైదరాబాద్, ఆట ప్రతినిధి: జమ్ము కశ్మీర్ వేదికగా జరిగిన యూటీటీ 84వ జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ ఇంటర్ స్టేట్ చాంపియన్షిప్లో తెలంగాణకు కాంస్య పతకం దక్కింది. గురువారం జరిగిన సెమీస్లో తెలంగాణ పురుషుల టీమ్ 2-3 తేడాతో రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు చేతిలో ఓడి కాంస్యం సొంతం చేసుకుంది. మరోవైపు మహిళల ప్రిక్వార్టర్స్లో తెలంగాణ 1-3తో తమిళనాడు చేతిలో ఓడింది. కాంస్యం గెలిచిన జట్టును రాష్ట్ర టీటీ అసోసియేషన్ కార్యదర్శి నాగేందర్రెడ్డి, సోమ్నాథ్ ఘోష్, అమన్ బలుగు, వేణుగోపాల్ అభినందించారు.