న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ లక్ష్యసేన్.. యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్ 21-10, 21-17తో భారత్కే చెందిన శంకర్ ముత్తుస్వామిపై విజయం సాధించాడు.
ఆదివారం జరుగనున్న సెమీస్లో రెండో సీడ్ లి షి ఫెంగ్ (చైనా)తో లక్ష్య తలపడనున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్లో పీవీ సింధు 20-22, 13-21తో ఫెంగి జియా (చైనా) చేతిలో ఓడింది.