హనుమకొండ చౌరస్తా: తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అండర్-15, అండర్-20 రెజ్లింగ్ చాంపియన్షిప్ బుధవారం ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం(జేఎన్ఎస్)లో నిర్వహిస్తున్న పోటీల్లో రాష్ట్రంలోని 33జిల్లాల నుంచి 600మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభ కనబర్చారు. పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగిన క్రీడాకారులు ప్రత్యర్థిని ఓడించడంలో ఎత్తుకుపైఎత్తులు వేశారు.
ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించి మాట్లాడారు. భారతదేశ సంసృతి, సంప్రదాయానికి ప్రతీక అయిన రెజ్లింగ్ క్రీడలో తెలంగాణ కీర్తి ప్రతిష్టలను జాతీయస్థాయిలో ఇనుమడింపజేయాలన్నారు. తెలంగాణ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు హఫీజ్ఖాన్ మాట్లాడుతూ ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తూమన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కరీం మాట్లాడుతూ పోటీలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు గ్వాలియర్లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.