హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ కెరీర్లో మరో కీలక మలుపు. రానున్న సీజన్లో యూరోపియన్ టీటీ క్లబ్ పోలండ్కు చెందిన యూకేఎస్ విల్లా వెర్దె ఒలెస్నో తరఫున స్నేహిత్ బరిలోకి దిగనున్నాడు. సంవత్సర కాలానికి గాను స్నేహిత్తో సదరు క్లబ్ ఒప్పందం చేసుకుంది. తెలుగు రాష్ర్టాల నుంచి యూరోపియన్ లీగ్లో ఆడుతున్న తొలి ప్లేయర్గా హైదరాబాదీ స్నేహిత్ నిలిచాడు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నాడు. ‘ఈ కాంట్రాక్టు పట్ల ఆసక్తితో ఎదురుచూస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో మరింత అనుభవం దక్కించుకునేందుకు ఇది మంచి అవకాశం’ అని స్నేహిత్ అన్నాడు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్లో ప్రస్తుతం డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న స్నేహిత్ స్పెయిన్లో క్లబ్ మ్యాచ్లు ఆడాడు. ఈ సందర్భంగా తన కోచ్ సోమ్నాథ్ ఘోష్కు స్నేహిత్ కృతజ్ఞతలు తెలిపాడు.