హైదరాబాద్ : నేషనల్ గేమ్స్ -2022లో మహిళల షూటింగ్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో తెలంగాణ షూటర్ ఈషా సింగ్ తొలి బంగారు పతకం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈషా సింగ్ను ప్రభుత్వ క్రీడా శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అభినందించారు. మంగళవారం బీఆర్కే భవన్లో తన చాంబర్లో ఈషా సింగ్ను శాలువాతో ఘనంగా సత్కరించారు. జాతీయ క్రీడల్లో ఈషా సింగ్ తొలిసారి పాల్గొని బంగారు పతకం సాధించడం పట్ల ఆయన అభినందించారు.
#NationalGames2022. Won first gold 🏅 Olympic event for my state Telangana 25msportspistol.@TelanganaCMO @MPsantoshtrs @RaoKavitha @KTRTRS @jayesh_ranjan @suldeep @Media_SAI @DGSAI pic.twitter.com/0weXDCjq5p
— Esha Singh (@singhesha10) October 1, 2022