హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు చదువుల్లోనే కాదు క్రీడల్లోనూ అదరగొడుతున్నారు. కటక్(ఒడిశా) వేదికగా జరిగిన 33వ జాతీయ సబ్జూనియర్ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో తెలంగాణ 2-0 తేడాతో మధ్యప్రదేశ్పై అద్భుత విజయం సాధించింది. తుదిపోరులో సృజన(సుద్దపల్లి), పూజ(ములుగు) మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. జాతీయ సాఫ్ట్బాల్ విజేతగా నిలిచిన జట్టును రాష్ట్ర గురుకుల పాఠశాలల కార్యదర్శి రొనాల్డ్ రాస్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో ఏర్పాటు చేసిన అకాడమీల వల్ల అద్భుత ఫలితాలు వస్తున్నాయని క్రీడాధికారి రామ్లక్ష్మణ్ పేర్కొన్నారు.