హైదరాబాద్, ఆట ప్రతినిధి: విధుల్లో నిరంతరం బిజీగా ఉండే ఉద్యోగులు క్రికెట్ టోర్నీ ద్వారా ఉపశమనం పొందుతున్నారు. ఎమ్డీఆర్ యంగ్లీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరులో శనివారం ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నీ అట్టహాసంగా మొదలైంది.
స్థానిక ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ టోర్నీని ప్రారంభించారు. పోటీల తొలి రోజు మొత్తం ఆరు మ్యాచ్లు జరిగాయి. తొలుత జరిగిన మ్యాచ్లో గ్లాండ్ఫార్మా ..విర్చో బయోటెక్పై 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. హుహట్మకి..తోషిబాపై 3 వికెట్ల తేడాతో, ఎమ్ఆర్ఎఫ్ 14 పరుగుల తేడాతో బయోకాన్పై గెలిచాయి ప్రారంభ కార్యక్రమంలో ఎమ్డీఆర్ ఫాండేషన్ కోఫౌండర్ పృథ్వీరాజ్ పాల్గొన్నారు.