న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే రెండో టెస్టు పూర్తి స్థాయి ప్రేక్షకుల సమక్షంలో జరుగనున్నది. ఈ టెస్టుకోసం అమ్మకానికి పెట్టిన టిక్కెట్లన్నీ అమ్ముడు పోయాయని ఢిల్లీ క్రికెట్ సంఘం వెల్లడించింది. 2017 తరువాత ఢిల్లీలో టెస్టు మ్యాచ్ నిర్వహించడం మరలా ఇదే.
40వేల సామర్ధ్యం కలిగిన అరుణ్ జైట్లీ స్టేడియంలో 24వేల టిక్కెట్లను అమ్మకానికి పెట్టారు. 8వేల టిక్కెట్లు డిడిసీఏ సభ్యులకు కేటాయించారు. తక్కినవి మ్యాచ్కు హాజరయ్యే సెలబ్రిటీలకు కేటాయించారు. నాగపూర్లో జరిగిన తొలి టెస్టును గెలుచుకుని టీమ్ ఇండియా సమరోత్సాహంతో ఉంది. దీనితో టిక్కెట్లన్నీ హాట్కేకుల్లా అమ్ముడయ్యాయని డిడిసీఏ అధికారి ఒకరు తెలిపారు.