హైదరాబాద్, ఆట ప్రతినిధి: శ్రీనిధి యూనివర్సిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్(టీపీజీఎల్) సీజన్-3లో ఆర్య వారియర్స్ టీమ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్లో ఆర్య వారియర్స్ 3.5-2.5 తేడాతో ఎమ్వైకే స్ట్రైకర్స్పై అద్భుత విజయం సాధించింది.
వారియర్స్ తరఫున వికాస్రెడ్డి(1), వీరన్బాబు(0.5), ఫహీముద్దీన్(0.5) రాణించారు. మరో సెమీస్లో టీమ్ టీఆఫ్ 4-2తో లహరి లయన్స్పై గెలిచింది. ఈ నెల 5న ఆర్య వారియర్స్, టీమ్ టీఆఫ్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరుగనుంది.