FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్కు చేరిన ఫ్రాన్స్ జట్టును అనారోగ్యం వెంటాడుతోంది. ఆ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు అనారోగ్యంతో బాధపడుతున్నారు. రాఫెల్ వరనే, ఇబ్రహిమ కొనటే, కింగ్స్లే కొమన్లకు జలుబు చేసింది. దాంతో వీళ్లు శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్కు హాజరుకాలేదు. ఆదివారం అర్జెంటీనాతో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దాంతో, ఫ్రాన్స్ శిబిరం అందోళనతో ఉంది.
బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఫ్రాన్స్ 2-0తో మొరాకోపై విజయం సాధించింది. మొదటి సెమీఫైనల్లో అర్జెంటీనా 3-0తో క్రొయేషియాను చిత్తు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఫ్రాన్స్ ఈసారి కూడా ట్రోఫీ ఎగరేసుకుపోవాలని అనుకుంటోంది. అర్జెంటీనా కెప్టెన్ మెస్సీకి ఇదే చివరి వరల్డ్ కప్. దాంతో ఆ టీమ్ కూడా కప్పు గెలిచి తమ నాయకుడికి ఘనంగా వీడ్కోలు పలకాలని భావిస్తోంది. ఈ రెండు టీమ్లలో ఎవరు విజేత అయినా మూడో సారి కప్పు సొంతమవుతుంది.