అహ్మదాబాద్: వన్డే ప్రంపచకప్ ఫైనల్కు అంపైర్లు ఖరారయ్యారు. ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్లోని ప్రపంచలోనే అతిపెద్దదైన క్రికెట్ మైదానంలో జరుగనున్న తుదిపోరుకు రిచర్డ్ ఇల్లింగ్వర్త్, రిచర్డ్ కెటిల్బొర్గ్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు.
జోయల్ విల్సన్ థర్డ్ అంపైర్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. క్రిస్ గాఫనీ ఫోర్త్ అంపైర్గా వ్యవహరించనున్నట్లు ఐసీసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.