న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ) రెండో సీజన్కు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి రాంచీ వేదికగా టోర్నీ మొదలవుతున్నది. దిగ్గజ క్రికెటర్లు మునాఫ్ పటేల్, ప్రవీణ్ తాంబే, హషీమ్ ఆమ్లా, అండ్రూ లీపస్, రామన్ రహేజ్ శుక్రవారం ట్రోఫీని ఆవిష్కరించారు.
డిసెంబర్ర 9వ తేదీ వరకు 22 రోజుల పాటు జరిగే లీగ్లో మొత్తం 19 మ్యాచ్లు జరుగనున్నాయి. గతేడాది ఫైనలిస్టులు బిల్వారా కింగ్స్, ఇండియా క్యాపిటల్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది.