Sahaja Yamalapalli | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ముంబై ఓపెన్ టెన్నిస్ టోర్నీలో తెలంగాణ ప్లేయర్ యామలపల్లి సహజ ప్రిక్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. డబ్ల్యూటీఏ 125కే టోర్నీ తొలి రౌండ్లో సహజ 6-4, 1-6, 6-4తో ప్రపంచ 92వ ర్యాంకర్ కాయ్లా డాయ్ (అమెరికా)పై విజయం సాధించింది.
తనకంటే మెరుగైన ప్రత్యర్థిపై తొలి సెట్ సులువుగా గెలిచిన సహజ.. రెండో సెట్లో పరాజయం పాలైనా.. నిర్ణయాత్మక సెట్లో విజృంభించింది.