హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ఆవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన క్రికెట్ టోర్నీలో పోలీస్ టీమ్ విజేతగా నిలిచింది. మాదక ద్రవ్యాల వాడకంపై అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ‘సే నో టు డ్రగ్స్’ పేరిట సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఈ టోర్నీ ఫైనల్లో పోలీస్ జట్టు 39 పరుగుల తేడాతో డాక్టర్స్ టీమ్పై విజయం సాధించింది. తొలుగ బ్యాటింగ్ చేసిన పోలీస్ టీమ్ 8 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన డాక్టర్స్ జట్టు 8 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 48 పరుగులకు పరిమితమైంది. సునీల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, శివకు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. ముగింపు వేడుకల్లో హోంమంత్రి మహమూద్ అలీ, రాజ్యసభ ఎంపీ గాయత్రి రవి, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన ప్లేయర్గా ఎలక్ట్రిక్ స్కూటీ అందజేశారు.