కోల్కతా: వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్న బంగ్లాదేశ్తో.. ఏమూలో చిన్న ఆశ ఉన్న పాకిస్థాన్ జట్టు అమీతుమీకి సిద్ధమైంది.
మంగళవారం ఈడెన్ గార్డెన్స్లో బంగ్లాపై గెలిచి సెమీస్ రేసులో సజీవంగా ఉండాలని పాక్ భావిస్తుంటే.. చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించడమే ఇప్పుడు తమ లక్ష్యమని బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ వెల్లడించాడు. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడిన పాకిస్థాన్ బంగ్లాపై ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి.