హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిభను ప్రోత్సహించడంలో తెలంగాణ ముందుందని సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ అన్నారు. గచ్చిబౌలి ఆక్వాటిక్ స్టేడియంలో జరుగుతున్న జాతీయ సీనియర్ ఆక్వాటిక్ చాంపియన్షిప్ను ఆదివారం సాట్స్ చైర్మన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, అమిత్వ ముఖర్జీ, వీరేంద్ర నానావతి, జగదీశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ.. తొమ్మిదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిభావంతులైన ఎందరో క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించిందన్నారు. క్రీడాకారులకు రిజర్వేషన్లు ఇస్తున్నట్లు గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు చలో మైదాన్ కార్యక్రమాన్ని చేపట్టి యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని అన్నారు.