న్యూఢిల్లీ: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. నీతూ, ప్రీతి, మంజు ప్రిక్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లారు.
శనివారం 48 కేజీల విభాగంలో నీతూ.. కొరియా బాక్సర్పై ఏకపక్ష విజయం సాధించింది. మరో బౌట్లో ప్రీతి (54 కేజీలు) 4-3తో ప్రెజికోపై గెలుపొందింది. 66 కేజీల విభాగంలో మంజు 5-0తో కారా వెరువాపై విజయం సాధించింది. ఆదివారం తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ రెండో రౌండ్ బరిలో దిగనుంది.