హైదరాబాద్ : ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ పరాజయ పరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం పుణెరి పల్టన్తో జరిగిన పోరులో టైటాన్స్ 25-38 స్కోరుతో ఓటమిపాలైంది. టైటన్స్ కిది 16వ ఓటమి. విరామానికి 10-14తో వెనుకంజలో ఉన్న టైటాన్స్ ద్వితీయార్ధంలోనూ పుంజుకోలేకపోయింది. పుణె జట్టులో మోహిత్, అస్లామ్ చెరి 8, ఆకాష్ 5, సంకేత్ 4, ఫాజల్ 3 పాయింట్లు సాధించగా, టైటాన్స్ జట్టులో ఆదర్శ్ 9, పర్వేష్ 4, అంకిత్ 3 పాయింట్లు సాధించారు. బెంగాల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో యు ముంబా 49-41తో విజయం సాధించింది.