ముంబై: ఐపీఎల్ సీజన్ కొత్త టెక్నాలజీతో ముందుకు రాబోతున్నది. ఔట్ల విషయంలో థర్డ్ అంపైర్ వేగంగా, కచ్చితత్వంతో నిర్ణయాలు తీసుకునేందుకు అనుగుణంగా ఈ సీజన్లో స్మార్ట్ రిప్లే సిస్టమ్ తీసుకొస్తున్నారు. ఈ టెక్నాలజీలో టీవీ అంపైర్కు ఇద్దరు హ్యాక్-ఐ సిస్టమ్ ఆపరేటర్లు నేరుగా ఇన్పుట్స్ అందిస్తారు.
మైదానం మొత్తం కవర్ చేసే విధంగా ఎనిమిది హైస్పీడ్ కెమెరాలు తీసిన ఫొటోలతో థర్డ్ అంపైర్కు సాయం చేస్తారు. ఈ కొత్త సిస్టమ్..స్ప్లిట్ ఇన్ స్క్రీన్ ఇమేజ్లతో గతంలో కంటే ఎక్కువ చిత్రాలను విశ్లేషించేందుకు అంపైర్లకు అవకాశం లభిస్తుంది. దీనికి తోడు ఏం జరుగుతుందనే దానిపై అభిమానులకు స్పష్టమైన అవగాహన లభిస్తుంది. ఈ మధ్యే దీనిపై అవగాహన కోసం అంపైర్లకు శిక్షణ అందించారు.