ముంబై: చివరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. శనివారం జరిగిన నాలుగో టీ20లో ఆస్ట్రేలియా 7 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 188 పరుగులు చేసింది. పెర్రీ (72*), ఆష్లే (42), హీలీ (30) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (46), రిచాఘోష్ (40), దేవిక (32) పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను ఆస్ట్రేలియా 3-1తో కైవసం చేసుకుంది.