లండన్: హాకీ ప్రో లీగ్లో భారత పురుషుల జట్టు జోరు కొనసాగుతున్నది. గత మ్యాచ్లో ఒలింపిక్ చాంపియన్ బెల్జియంను చిత్తు చేసిన భారత్.. శనివారం జరిగిన పోరులో గ్రేట్ బ్రిటన్ను మట్టికరిపించింది. ఇరు జట్ల స్కోర్లు 4-4తో సమం కాగా.. విజేతను తేల్చేందుకు నిర్వహించిన షూటౌట్లో భారత్ 4-2తో బ్రిటన్ను ఓడించింది.
మ్యాచ్ ఫుల్టైమ్లో భారత్ తరఫున హర్మన్ప్రీత్ సింగ్ (7వ నిమిషంలో), మన్దీప్ సింగ్ (19వ ని.లో), సుఖ్జీత్ సింగ్ (28వ ని.లో), అభిషేక్ (50వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. ఆట ఆరంభం నుంచి మంచి పట్టు కొనసాగించిన భారత్ చివరి క్వార్టర్లో ప్రత్యర్థికి మూడు గోల్స్ సమర్పించుకుంది. అనంతరం నిర్వహించిన షూటౌట్లో మన ఆటగాళ్లంతా సత్తాచాటడంతో భారత్ ఘనవిజయం సాధించింది.