బెంగళూరు: గత మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై ఘనవిజయం సాధించిన భారత ఫుట్బాల్ జట్టు.. అదే జోష్లో నేపాల్ను చిత్తుచేసింది. దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్లో భాగంగా శనివారం జరిగిన గ్రూప్-‘ఎ’పోరులో భారత్ 2-0తో నేపాల్పై గ్రాండ్విక్టరీ కొట్టింది. పాక్పై హ్యాట్రిక్ నమోదు చేసిన భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ ఈ మ్యాచ్లోనూ ఓ గోల్ (61వ నిమిషంలో) చేయగా.. మహేశ్ సింగ్ (70వ ని.లో) మరో గోల్ సాధించాడు. ప్రథమార్థంలో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో గోల్ నమోదు కాకపోగా.. సెకండ్హాఫ్లో మనవాళ్లు విజృంభించారు. గ్రూప్ దశలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గిన ఛెత్రీ సేన 6 పాయింట్లతో సెమీఫైనల్కు దూసుకెళ్లింది.