దుబాయ్: కొలంబో టెస్టులో తొలిరోజు వాగ్వాదానికి దిగిన భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్, శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండోకు ఐసీసీ షాకిచ్చింది. ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.12ను ఉల్లంఘించినందుకు గాను ఈ ఇద్దరి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడమే గాక ఒక డీమెరిట్ పాయింట్ను జతచేసింది. భారత ఇన్నింగ్స్ సందర్భంగా 17వ ఓవర్లో జైస్వాల్ను ఔట్ చేసిన ఫెర్నాండో.. అతడిని ఉద్దేశిస్తూ ఏదో అనడంతో గొడవ మొదలైంది.
డగౌట్కు వెళ్తున్న జైస్వాల్ తిరిగొచ్చి తన హెల్మెట్తో ఫెర్నాండోను నెట్టేశాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఇతర ఆటగాళ్లు వారిని వారించారు. ఈ ఉదంతంపై జైస్వాల్ స్పందిస్తూ.. ‘అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరు ఎలాంటి అభిప్రాయానికి రాకండి. ఎవరైనా హద్దులు మీరితే ఈ భారత జట్టు వారికి దీటైన జవాబిస్తుంది’ అని పేర్కొన్నాడు.