మాంగ్ కాంగ్(హాంకాంగ్) : మహిళల ఎమర్జింగ్ ఆసియాకప్లో మంగళవారం జరిగిన మ్యాచ్లో హాంకాంగ్ జట్టు భారత్ చేతిలో చిత్తుగా ఓడింది. యువ ఆల్రౌండర్ శ్రేయాంక పాటిల్ కేవలం రెండు పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో ముఖ్యపాత్ర పోషించింది.
శ్రేయాంక ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ 14 ఓవర్లలో 34 పరుగులకే ఆలౌటయింది. భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 5.2 ఓవర్లలో 38 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. గొంగడి త్రిష 19 పరుగులతో అజేయంగా నిలిచింది.