హోవ్ : ఇండియా, ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి వన్డే ఆదివారం జరుగనున్నది. టీ20 సిరీస్ను 1-2తో కోల్పోయిన భారత జట్టు వన్డే సిరీస్లోనైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఈ సిరీస్తో భారత పేసర్ జులన్ గోస్వామి క్రికెట్కు గుడ్బై చెప్పనున్నందున సిరీస్ను ఆమెకు బహుమతిగా అందించాలని జట్టు ఆశిస్తున్నది. భారత బ్యాటింగ్ ఆర్డర్ను బలీయం చేసేందుకు కొత్త క్రీడాకారిణులకు అవకాశం కల్పించే దిశగా యాజమాన్యం యోచిస్తున్నది.