లండన్: భారత్, ఇంగ్లండ్ మధ్య రైద్దెన ఐదో టెస్టుపై ఎటూ తేల్చుకోలేకపోతున్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ).. ఈ అంశంలో సహాయం చేయాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని సంప్రదించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా.. టీమ్ఇండియా, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్లో జరుగాల్సిన మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు కాగా.. సిరీస్ ఫలితం విషయంలో ఇరు బోర్డుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఐసీసీ వివాద పరిష్కార కమిటీ (డీఆర్సీ)కి లేఖ రాసినట్లు ఇంగ్లండ్ బోర్డు ప్రతినిధి తెలిపారు. మ్యాచ్ ఆరంభానికి ముందు భారత సహాయక బృందంలో కరోనా కేసులు వెలుగు చూడటంతో కోహ్లీసేన బరిలోకి దిగేందుకు నిరాకరించింది.
నాలుగు మ్యాచ్లు ముగిసేసరికి టీమ్ఇండియా సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉండగా.. ఒక వేళ ఈ మ్యాచ్ను ఐసీసీ రద్దు చేసినట్లు ప్రకటిస్తే.. సిరీస్ భారత్ సొంతమవుతుంది. మైదానంలో అడుగుపెట్టేందుకు కోహ్లీసేన ముందుకు రాకపోవడంతో ఫలితం ఇంగ్లండ్కు అనుకూలంగా వస్తే.. సిరీస్ 2-2తో సమం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా జరుగుతున్న పోరు కావడంతో పాటు వందల కోట్లతో ముడిపడిన అంశం కావడంతో ఐసీసీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే నిర్ణయం తీసుకునే చాన్స్లు కనిపిస్తున్నాయి. రైద్దెన మ్యాచ్ను రీషెడ్యూల్ చేసేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాడు.