చెన్నై : ఈ ఏడాది జరగాల్సి ఉన్న ప్రపంచ చెస్ చాంపియన్షిప్ను భారత్లో నిర్వహించాలని ఆలిండియా చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) భావిస్తోంది.
రెండ్రోజుల క్రితం టొరంటో వేదికగా ముగిసిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీని గెలుచుకున్న భారత యువగ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్.. వరల్డ్ చెస్ చాంపియన్షిప్ టైటిల్ పోరులో చైనా గ్రాండ్మాస్టర్ డింగ్ లిరెన్తో ఆడేందుకు అర్హత సాధించిన నేపథ్యంలో ఈ టోర్నీని ఇక్కడే నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు ఏఐసీఎఫ్ నితిన్ తెలిపారు.
‘మేం పరిస్థితిని అంచనా వేస్తున్నాం. రాబోయే కొద్దిరోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది’ అని చెప్పారు.