లండన్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి టెస్టు క్రికెట్పై మక్కువ ఎక్కువని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. టెస్టులు ఆడుతున్నప్పుడు అతడి ఉత్సాహం, అభిరుచి అదే తెలియజేస్తున్నాయని తెలిపాడు. ‘విరాట్ నా తరహాలోనే ఉన్నాడు. అతడు సచిన్, ద్రవిడ్ వంటి దిగ్గజాల అడుగుజాడల్లోనే నడుస్తున్నాడని నాకు తెలుసు. అందుకే అతడు టెస్టులకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడు. అయితే అతడు టెస్టులతో పాటు టీ20ల్లోనూ రాణించాల్సి ఉంది. అన్ని రకాల పరిస్థితుల్లోనూ జట్టు గెలుపునకు విరాట్ విలువిస్తాడు. అందుకే టీమ్ఇండియా ఆస్ట్రేలియాలో గెలిచింది. ఇప్పుడు లార్డ్స్లోనూ నెగ్గి ఇంగ్లండ్పై ఆధిక్యం సాధించింది. అది కోహ్లీని తప్పకుండా సంతృప్తిపరిచి ఉంటుంది. టెస్టులు ఆడే సమయంలో విరాట్ జట్టును నడిపే తీరు దూకుడుగా ఉంటుంది. అతడికి టెస్టు క్రికెట్టే అంతా’ అని పీటర్సన్ తన బ్లాగులో రాసుకొచ్చాడు.