శేరిలింగంపల్లి, ఏప్రిల్ 6: తల్లిదండ్రులు చిన్నారులను కేవలం చదువులకు మాత్రమే పరిమితం చేయకుండా చాంపియన్లుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ అన్నాడు. మంగళవారం గచ్చిబౌలిలోని గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా భేటీలో పేస్ మాట్లాడాడు.
‘నా జీవితాన్ని ఆధారంగా చేసుకొని గ్రీన్గోల్డ్ యానిమేషన్ సంస్ధ “లిటిల్ లియాండర్” పేరిట యానిమేషన్ సీరీస్ రూపొందించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులకు దగ్గరయ్యేందుకు వారిని ప్రబావితం చేసేందుకు ఈ సీరీస్ ఎంతగానో దోహాదపడుతుంది. చాంపియన్లుగా ఎదగడానికి ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించేందుకు అవసరమైన కృషిని యానిమేషన్లో పొందుపరుస్తారు’ అని అన్నాడు. ఈ కార్యక్రమంలో గ్రీన్గోల్డ్ యానిమేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.