పుణె : అల్టిమేట్ ఖోఖో లీగ్లో తెలుగు యోధాస్కు మరో ఓటమి ఎదురయింది. గురువారం తెలుగు యోధాస్ 48-51 తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓడిపోయింది. మంగళవారం ముంబై చేతిలో కూడా యోధాస్ ఓడిన సంగతి తెలిసిందే. శివారెడ్డితోపాటు, అభినందన్ పాటిల్, కెప్టెన్ రంజన్ శెట్టి రాణించారు.
మరో మ్యాచ్లో ఒడిశా జగ్గర్నాట్స్ 51-45 స్కోరుతో రాజస్థాన్ వారియర్స్ను ఓడించింది. శుక్రవారంనాటి మ్యాచ్లలో చెన్నై-గుజరాత్తో, ముంబై ఖిలాడీస్- తెలుగు యోధాస్తో తలపడతాయి.