అహ్మదాబాద్: తెలుగు ఆటగాడు అంబటి తిరుపతి రాయుడు ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 16వ సీజన్ ఫైనల్ తర్వాత తాను లీగ్కు గుడ్బై చెప్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. 2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా తనను ఎంపిక చేయలేదనే బాధలో అప్పట్లోనే క్రికెట్కు వీడ్కోలు పలికిన రాయుడు.. ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
ఈ సారి అలాంటి యూ టర్న్లు తీసుకోబోనని పేర్కొన్నాడు. 38 ఏండ్ల ఈ హైదరాబాదీ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2010 నుంచి ఐపీఎల్ ఆడుతున్న అంబటి.. ముంబై, చెన్నై జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 14 సీజన్లలో 204 మ్యాచ్లాడి 5 ట్రోఫీలు చేజిక్కించుకున్నాడు. జాతీయ జట్టు తరఫున 55 వన్డేలాడిన రాయుడు 1694 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 10 హాఫ్సెంచరీలు ఉన్నాయి.