Sahaja Yamalapalli | హైదరాబాద్, ఆట ప్రతినిధి: నాగ్పూర్(మహారాష్ట్ర) వేదికగా జరుగుతున్న మహా ఉర్జా ఐటీఎఫ్ టోర్నీలో తెలంగాణ యువ ప్లేయర్ సహజ యమ్లపల్లి సత్తాచాటింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్లో సహజ 3-6, 6-1, 6-1 తేడాతో వైదేహి చౌదరీపై అద్భుత విజయం సాధించి ప్రిక్వార్టర్స్లోకి దూసుకెళ్లింది.
తొలి సెట్ను ప్రత్యర్థికి చేజార్చుకున్న సహజ..వరుస సెట్లలో మట్టికరిపించింది. కోర్టులో తనైదన దూకుడు కనబరిచిన ఈ యువ ప్లేయర్ బలమైన బేస్షాట్లు, ఫోర్హ్యాండ్లతో వైదేహిని ఉక్కిరి బిక్కిరి చేసింది.