నిడమనూరు: వరల్డ్ టెన్నిస్ టూర్లో తెలంగాణ యువ ప్లేయర్ నూకల షన్వితారెడ్డి రన్నరప్గా నిలిచింది. ఉగాండా దేశంలోని కంపాలా వేదికగా జరిగిన ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ అండర్-18 విభాగంలో ఐదు దేశాల ప్లేయర్లతో కలిసి షన్వితారెడ్డి బరిలోకి దిగింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో షన్విత 4-6, 3-6తో లీలా అక్మెతోవా (రష్యా) చేతిలో ఓటమిపాలైంది.
అంతకుముందు జరిగిన సెమీస్లో ఈ యువ ప్లేయర్ 6-1, 6-3తో మార్టిన్ మావో(టాంజానియా)పై, క్వార్టర్స్లో సియా మహాజన్పై 6-2, 6-2తో గెలిచి సత్తాచాటింది. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన పటాన్చెరు సీఐ వేణుగోపాల్రెడ్డి కుమార్తె షన్వితారెడ్డి రాణించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.