హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో తెలంగాణకు కాంస్య పతకం దక్కింది. బుధవారం జరిగిన మహిళల స్కీట్ ఈవెంటులో రాష్ట్ర త్రయం రష్మీ రాథోడ్, వెంకట్ లక్ష్మి, జహ్రా ముఫ్పాదాల్ మూడో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో పంజాబ్, రాజస్థాన్ జట్లు వరుసగా స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు.