హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ ఫెడరేషన్ కప్ నెట్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ బాలికల జట్టు కాంస్య పతకంతో మెరిసింది. ఢిల్లీలో శుక్రవారం తెలంగాణ, కేరళ మధ్య జరిగిన కాంస్య పతక వర్గీకరణ మ్యాచ్ 15-15తో డ్రాగా ముగిసింది. తెలంగాణ తరుఫున సింధూజ, మేఘన, మస్రత్, అరుణ, తబస్సుమ్, అఖిల, నందిని, మౌనిక, సమిత, అఖిల, ఉషాశ్రీ, రవళి బరిలోకి దిగినట్లు రాష్ట్ర నెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మహమ్మద్ ఖాజాఖాన్ పేర్కొన్నారు.