హిసార్ : కామన్వెల్త్ కాంస్య పతక విజేత, తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో టైటిల్ పోరుకు దూసుకెళ్లాడు. పురుషుల 57 కిలోల విభాగంలో తలపడుతున్న హుసాముద్దీన్ సెమీస్లో హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆశిష్కుమార్పై ఏకపక్షంగా విజయాన్నందుకున్నాడు. ఫైనల్లో హుసాముద్దీన్ ఆర్పీబీకి చెందిన సచిన్తో తలపడతాడు. ఆరుసార్లు ఆసియన్ పతక విజేత శివ థాపా(63కి)కూడా ఫైనల్కు చేరుకున్నాడు. శివ థాపా 5-0 తేడాతో మనీష్ కౌషిక్పై గెలుపొందాడు.