హైదరాబాద్, ఆట ప్రతినిధి: పారిస్ ఒలింపిక్స్ తొలి అర్హత టోర్నీలో భారత యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ బరిలోకి దిగబోతున్నాడు. ఇటలీ వేదికగా ఫిబ్రవరి 29 నుంచి ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ టోర్నీ జరుగనుంది.
ఇందుకోసం జాతీయ బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) సోమవారం జట్టును ప్రకటించింది. ఇందులో హుసామ్తో పాటు శివ థాపా, నిశాంత్దేవ్, లక్ష్య చాహర్, సంజీత్, నరేందర్, జాస్మిన్, అంక్షిత ఉన్నారు. ఇప్పటికే పారిస్కు నిఖత్ జరీన్, ప్రీతి, పర్వీన్, లవ్లీన బెర్తు దక్కించుకున్న సంగతి తెలిసిందే.