హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర అథ్లెటిక్స్ మీట్ను నిర్వహించారు. హైదరాబాద్ గోల్కొండ ఫోర్ట్ ఆర్టిలరి సెంటర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మీట్లో 33 జిల్లాల నుంచి అథ్లెట్లు పాల్గొన్నారు. లాంగ్, మిడిల్ డిస్టాన్స్ మీట్ను సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సాట్స్ చైర్మన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఉపయోగించుకొని యువ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రం నుంచి పీటీ ఉషా, ఉసెన్ బోల్ట్ వంటి అథ్లెట్లు వెలుగులోకి రావలన్నదే కేసీఆర్ ప్రభుత్వ ఆశయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రమేశ్, స్టాన్లీ జోన్స్, సారంగపాణి, రాజేశ్, రమేశ్ పాల్గొన్నారు.