న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్లో తాలిబన్లు తమ అరాచక పాలన కొనసాగిస్తూనే ఉన్నారు. మహిళల పట్ల తమ వివక్ష వైఖరిని ఏ మాత్రం మార్చుకోని అఫ్గన్లు తాజాగా ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారాలపై తమ దేశంలో నిషేధం విధించారు. స్టేడియంలో మహిళలు నృత్యాలు చేస్తున్న దృశ్యాలను తమ దేశంలో ప్రసారం చేయలేమని కరాఖండిగా ప్రకటించారు. తమ మత ఆచారాలకు విరుద్ధంగా ఉన్న కారణంగా ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేస్తున్నామని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) మీడియా మేనేజర్ ఇబ్రహీం మంగళవారం పేర్కొన్నాడు.