హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో జరుగుతున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. మంగళవారం ఎల్బీ స్టేడియం టెన్నిస్ కోర్టులో పిల్లలను ఉద్దేశించిన ఆయన మాట్లాడారు.
‘వచ్చే నెల 31 వరకు జరిగే శిక్షణా శిబిరాల్లో పాల్గొనే పిల్లలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి. బాల్యం నుంచే మెరుగైన శిక్షణ పొందితే భవిష్యత్లో చాంపియన్లుగా ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది. వారికి నచ్చిన క్రీడను ఎంచుకుని ప్రతిభను మెరుగుపర్చుకోవాలి జూనియర్ విభాగాల్లో జాతీయ స్థాయిలో సత్తాచాటి రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ డీడీ ధనలక్ష్మి, స్టేడియం అడ్మినిస్ట్రేటర్ రవి పాల్గొన్నారు.