దుబాయ్: టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ దూసుకుపోతోంది. ఓపెనింగ్ మ్యాచ్లో భారత్పై చరిత్రాత్మక విజయం సాధించిన పాక్ జట్టు ఆ తర్వాత న్యూజిల్యాండ్పై కూడా అద్భుతంగా ఆడి విజయం సాధించింది. ఈ విజయాలపై పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ స్పందించాడు.
పాక్ ఆటగాళ్లు తమ అగ్రెసివ్ ఆటతీరును మిగతా టోర్నీలో కొనసాగించాలని అతను చెప్పాడు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన ఇంజమామ్.. రెండు మ్యాచుల్లోనూ హారిస్ రౌఫ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, జట్టులో ప్రతి ఆటగాడూ తమ పాత్రను చక్కగా పోషిస్తున్నారని కొనియాడాడు.
పాక్ జట్టు గొప్ప క్రికెట్ ఆడుతోందని, ఇదే ఆటతీరు కొనసాగిస్తే రెండో టీ20 ప్రపంచకప్ సాధించడం సాధ్యమేనని చెప్పాడు. ‘మహమ్మద్ హఫీజ్ ఫామ్లో లేడు. కానీ బాల్వింగ్ బౌలింగ్లో సిక్సర్ బాదాడు. ఇలాంటి అగ్రెసివ్ స్వభావాన్ని పాక్ జట్టు కోల్పోకూడదు’ అని ఇంజమామ్ సూచించాడు.
2009లో టీ20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకను ఓడించిన పాక్ జట్టు కప్పు ఎగరేసుకుపోయింది. పాక్ ఆటతీరు చూస్తుంటే ఈసారి కూడా కప్పు కొట్టేలా ఉందని ఆ జట్టు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.