బన్సీలాల్పేట్: భోపాల్ వేదికగా త్వరలో మొదలవుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు హైదరాబాద్కు చెందిన సిల్వరి వర్షిత ఎంపికైంది. ఈ సందర్భంగా శనివారం తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ యువ బాక్సర్ వర్షితను అభినందించారు. ఖేలో ఇండియా గేమ్స్లో సత్తాచాటి రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ(జగద్గిరిగుట్ట) మొదటి సంవత్సరం చదువుతున్న వర్షిత..ప్రస్తుతం జింఖానా మైదానంలో మనోజ్రెడ్డి దగ్గర శిక్షణ పొందుతున్నది. ఇప్పటికే పలు జిల్లా, రాష్ట్ర స్థాయి టోర్నీల్లో వర్షిత సత్తాచాటింది. తెలంగాణ జాగృతి కోఆర్టినేటర్ సుచిత్ర, పరమేశ్ కూతురు అయిన వర్షిత..ఖేలో ఇండియా గేమ్స్లో 54-57కిలోల విభాగంలో బరిలోకి దిగుతున్నది.